కరోనా కల్లోలం నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పని చేస్తున్న రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు.