దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి గడిచిన 24 గంటల్లో కొత్తగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 38,652 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 507 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720 కు పెరిగింది. ఇందులో 3,04,29,339 మంది బాధితుల కోలుకున్నారు. మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 4,18,987 మంది మరణించారు.