తెలంగాణలో ఈ రోజు మరో మూడు కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో తొలిసారిగా ఇద్దరు వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ సోకిన ఇద్దరు డాక్టర్లు కూడా భార్యాభర్తలు కావడం గమనార్హం హైదరాబాద్ దోమలగూడకు చెందిన డాక్టర్ తో పాటు ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. భర్త నుంచి భార్యకు కరోనా వ్యాప్తి చెందింది. కుత్బుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. డాక్టర్లయినా భార్యాభర్తలతో పాటు మరో వ్యక్తిని ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ముగ్గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 44కు చేరింది.