బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నితిశ్కుమార్పై చెప్పు విసిరిన ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. ముజఫర్పూర్ జిల్లాలోని సాక్రా గ్రామంలో సోమవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయనపై కొందరు నిరసనకారులు చెప్పు విసిరారు. ఈ ఘటనపై పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నితీశ్కుమార్ ఇటీవల ఓ ర్యాలీలో లాలూ ప్రసాద్యాదవ్కు అనుకూలంగా నినాదాలు చేయడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.