ఇంగ్లండ్ తో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పోరాడింది. భారత స్పిన్నర్లను తట్టుకొని నిలబడింది. కాస్త గట్టిగానే బ్యాటింగ్ చేసి 205 పరుగులకు ఆల్ ఔట్ అయ్యింది. ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పట్టుదలగా ఆడడంతో వికెట్ల పతనం ఆలస్యమైంది. అందరూ తలోచేయి వేసి స్కోరును 200 దాటించారు.
భారత బౌలర్లు శ్రమించారు. కానీ క్రమం తప్పకుండా వికెట్లను మాత్రం తిశారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ ను గంటకోసారి కూల్చుతూ సాయంత్రం నాలుగు గంటల వరకు నేలకూల్చారు.
మొదట సిరాజ్ వికెట్లు తీశయగా ఆ తర్వాత అక్షర్ పటేల్ 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బతీశారు. సుందర్ 1 వికెట్ తీశాడు.
ఈ టెస్ట్ గెలిస్తే భారత్ ప్రపంచ చాంపియన్ షిప్ కు నేరుగా అర్హత సాధిస్తుంది. డ్రా చేసుకున్నా కూడా ఫైనల్ చేరుతుంది. ఈ క్రమంలోనే స్పిన్ పిచ్ పై ఏమేరకు ఆడుతుందనేది వేచిచూడాలి.
కాగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ కూడా తేలిపోయింది. తొలి ఓవర్ లోనే భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ ను ఇంగ్లండ్ బౌలర్ అండర్సన్ ఔట్ చేశాడు. టీమిండియా పరుగుల ఖాతా తెరవకుండానే సున్నాకే వికెట్ కోల్పోయింది. దీన్ని బట్టి ఇక్కడ పిచ్ ప్రమాదకమని తేలిపోయింది.