ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్ల పల్లె గనిలో పేలుడు ఘటనపై విచారణను ముమ్మరం చేశామని కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేసు దర్యాప్తులో పురోగతిని వివరించారు. పేలుళ్లకు కారణమైన గన యజమాని నాగేశ్వర్ రెడ్డిని, గనిలోపనిచేసే రఘునాథ్ రెడ్డిని అరెస్టు చేశామని చెప్పారు. కారులో తీసుకువచ్చిన జలెటిన్ స్టిక్స్ కు అన్ లోడ్ చేసే సమయంలో పేలి 10 మంది కార్మికులు మరణించినట్లు వెల్లడించారు.