ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఆయన ఉద్యం ఢిల్లీ బయలుదేరారు. అమిత్షా అపాయిమెంట్ ముందే ఖరారు కావడంతో షెడ్యూల్ కంటే ముందే ఢిల్లీ వెళ్లారు. అలాగే ప్రధానమంత్రి మోదీని కూడా కలిసే అవకాశం ఉంది. ఇటీవల మోదీ ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో జగన్ ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: జగన్ ను వాడుకుంటున్న కేంద్రం