ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ చిట్టినగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లీ కొడుకులు మరణించారు. ఆదివారం ఉదయం బైక్ పై సామ్రాజ్యం, ఆమె కొడుకు రాధాక్రిష్ణలు వెళ్తుండగా చిట్టినగర్ సొరంగం సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.