దేశంలో లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదాపడగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు సెలబ్రెటీలు ఫ్యామిలీతో లాక్డౌన్ సమయాన్ని గడుపుతుండగా మరికొందరు తమ అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోయిన్లలో కొందరు హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతిపోగుతున్నారు. మరికొందరు ఫిట్ నెస్, యోగా, ఆన్ లైన్ క్లాసులు, కుకింగ్ వంటితో కాలక్షేపం చేస్తున్నారు. ఓ ముంబై భామ మాత్రం లాక్డౌన్ సమయంలో తెలుగు నేర్చుకుంటుందనే వార్త అందరిలో ఆసక్తిని రేపుతోంది. ఎవరా భామ అనే చర్చ మొదలైంది..
ఆమె ఎవరో కాదు.. చిలసౌ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుహాని శర్మ. ఈ ముంబై ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్లో చిన్న సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అందం, అభినయం పుష్కలంగా ఉండటంతో ఈ భామకు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాల్లో నటిస్తూ బీజీగా మారింది. ఎంఎస్ రాజు నిర్మిస్తున్న ‘డర్టీ హరీ’లో, మంచు విష్ణుకు జోడీగా ‘మోసగాళ్లు’ చిత్రంతోపాటు అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూహాని శర్మ నటించనుంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా రుహాని ఇంటికే పరిమితమైంది. ఈ సమయాన్ని రూహాని శర్మ తెలుగు నేర్చుకునేందుకు వినియోగించుకుంటుందట. రోజుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తుందని సమాచారం.
వలస కూలీల రైళ్లను రద్దు చేసిన బీజేపీ సర్కార్!
ఆన్ లైన్ ద్వారా, ఇంకా హైదరాబాదీలోని స్నేహితుల సాయంతో రుహానీ తెలుగు నేర్చుకుంటోంది. తెలుగులో రాయడంతోపాటు మాట్లాడేందుకు ట్రైనింగ్ తీసుకుంటోందట. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ అమ్మడు మంచినటిగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో తనకు వచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు.. కెరీర్లో మరింత ఎదిగేందుకు తెలుగు నేర్చుకునే పనిలో పడిందట. ఆమె నటించిన చిత్రాలు ఈ ఏడాది చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలు హిట్టయితే అగ్రహీరోలతో నటించే ఛాన్స్ దక్కడం ఖాయం. స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకునేందుకు ఇప్పటి నుంచే తెలుగును నేర్చుకుంటోంది. ఏదిఏమైనా ఈ ముంబై భామ తెలుగు నేర్చుకోవడంపై పలువురు అభినందిస్తున్నారు.