భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వ శాఖకు చెందిన చెందిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎండీసీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 89 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఎన్ఎండీసీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా జూన్ నెల 22వ తేదీ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
https://www.nmdc.co.in/ వెబ్ సైట్ లోని కెరీర్ సెక్షన్స్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలలో కొల్లియరీ ఇంజినీర్ (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 2, లెయిజనింగ్ ఆఫీసర్ 2, మైనింగ్ ఇంజినీర్ 12, సర్వేయర్ 2, ఎలక్ట్రికల్ ఓవర్మెన్ 4, మైన్ ఓవర్మెన్ 25, మెకానికల్ ఓవర్మెన్ 4, మైన్ సిర్దార్ 35 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా టెన్త్ క్లాస్, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు వాలిడ్ సర్దార్ సర్టిఫికెట్, అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇంటర్వ్యూ ఆధారంగా మిగిలిన పోస్టులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో 100 మార్కులకు ఉంటుందని సమాచారం.
ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.