ప్రపంచ వ్యాప్తంగా నిషేధించిన అల్ ఖైదా సంస్థ భారత్లో దాడులకు పాల్పడవచ్చని అమెరికా ఉగ్రవాద నిరోధక అధికారి క్రిస్టోఫర్ మిల్లెర్ చట్టసభ సభ్యులకు చెప్పారు. అల్ ఖైదా నాయకుడు అసిమ్ ఉమర్ మరణం తర్వాత మల్లి పుంజుకొని రతదేశంతోపాటు బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్థాన్ దేశాల్లో దాడి చెయ్యడానికి సిద్దమవుతున్నట్లు చెప్పాడు. గతంలో ఐక్యరాజ్యసమితి కూడా దాడులు జరిగే అవకాశ0 ఉందని తన నివేదికలో హెచ్చరించింది. కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 9మంది అల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు అనంతరం చేసిన విచారణలో ఢిల్లీతో సహా దేశంలోని పలు కీలక రక్షణ స్థావరాలపై దాడులు చేసేందుకు అల్ ఖైదా కుట్ర పన్నిందని ఎన్ఐఏ దర్యాప్తులోనూ వెల్లడైంది.