నేషనల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా తాజా అప్ డేట్ ఏమిటంటే, నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ ను కూడా ప్రారంభించాడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించబడుతున్న ఈ సినిమా అన్ని ప్రధాన భాషల్లో విడుదల కానుంది.
అందుకే నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం బాలీవుడ్ స్టార్స్ ను తీసుకొవాలని చూస్తున్నారు. పాన్ -ఇండియా చిత్రంగా ఈ చిత్రాన్ని మలచడానికి నాగ్ అశ్విన్ బాగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. తన గత సినిమా ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్.
కాగా ప్రభాస్ చిత్రాన్ని కూడా ఆయన అదే స్థాయిలో గొప్పగా తెరకెక్కిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నారు. కాగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ హీరోగా నటిస్తున్నాడట.