Prabhas, Gopi Chand : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. మాచో స్టార్ గోపీచంద్ ఎంత మంచి ఫ్రెండ్స్ అన్నది అందరికీ తెలిసిందే. వీళ్ల బంధం ఈ నాటిది కాదు. వర్షం సినిమా కన్నా ముందే ఉన్న పరిచయం.. ఆ సినిమా తర్వాత మరింత బలపడింది. వర్షంలో ప్రభాస్ హీరోగా చేస్తే.. గోపీచంద్ విలన్ గా అదరగొట్టాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి దోస్తులుగా కొనసాగుతున్నారు. సమయం వచ్చినప్పుడల్లా వేదికలపై తమ స్నేహాన్ని నిరూపిస్తూనే ఉంటారు.
తాజాగా.. గోపీచంద్ సినిమా ‘సీటీమార్’ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న గోపీచంద్ ఈ సినిమా సక్సెస్ పై నమ్మకంగా ఉన్నాడు. అనుకున్నట్టుగానే.. తొలి రోజు నుంచే ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ వస్తోంది. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఓ దశలో ఓటీటీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం కూడా సాగింది. కానీ.. నిర్మాతలు థియేటర్లకే మొగ్గు చూపారు. వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ నెల 10న సీటీమార్ రిలీజ్ అయ్యింది.
సీటీమార్ కు పాజిటివ్ టాక్ వస్తుండడంతో గోపీచంద్ మిత్రుడు, రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టాడు. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో విజిల్ ఫొటోను షేర్చేసిన ప్రభాస్.. తన మిత్రుడి సినిమా విజయాన్ని ప్రస్తావించాడు. ‘‘సీటీ మార్ చిత్రంతో నా ఫ్రెండ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఫలితం గురించి ఆలోచించకుండా.. ఇలాంటి పెద్ద చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చిన సినిమా యూనిట్ కు అభినందనలు’’ అంటూ పోస్టు చేశారు ప్రభాస్.
ఈ పోస్టుకు ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ తోపాటు అటు గోపీచంద్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. సీటీమార్ టీమ్ కు శుభాకాంక్షలుచెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాధేశ్యామ్ సంక్రాంతికి స్లాట్ బుక్ చేసుకుంది. ఇప్పుడు డార్లింగ్ యూకేలో ఉన్నారు. ప్రతిష్టాత్మక చిత్రం ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నారు ప్రభాస్. మరోవైపు సలార్ చిత్రాన్ని కూడా సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేయాలని చూస్తున్నారు.
https://www.instagram.com/p/CTtN_9PoZG6/?utm_source=ig_web_copy_link