మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. బైక్ కొనుగోలుపై ఏకంగా 28వేల రూపాయలు తగ్గింపు పొందే అవకాశం అయితే ఉంటుంది. బైక్ కొనుగోలు చేయాలని భావించే వాళ్లకు ఈ ఆఫర్ వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. ప్రముఖ వాహన తయారీ కంపెనీలలో ఒకటైన రివోల్ట్ మోటార్స్ ఈ ఆఫర్ ను అందిస్తోంది.
ఎలక్ట్రిక్ బైక్ ఆర్వీ400 ధరను ఏకంగా 28,201 రూపాయలు తగ్గించింది. పాపులర్ బైక్ లలో ఒకటైన ఈ బైక్ ధర తగ్గడం వల్ల వాహనదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం ఈ బైక్ కస్టమర్లకు అందుబాటు ధరలో లభ్యమవుతూ ఉండటం గమనార్హం. తగ్గింపు ధర వల్ల కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. తాజా రేటు తగ్గింపు వల్ల బైక్ ధర ఏకంగా రూ.90,799కు దిగొచ్చింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఫేమ్ 2 సబ్సిడీ స్కీమ్లో కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. సబ్సిడీ స్కీమ్ మార్పుల వల్ల బైక్ ధరలు భారీగా తగ్గడం గమనార్హం. గతంలో ఈ బైక్ ధర 1,19,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం తగ్గింపు ధరలు అమలులోకి వచ్చాయి. ఈ బైక్ లో ఎన్నో అద్భుతమైన ఫీచర్లు ఉండటం గమనార్హం. ఈ బైక్ లో 3 కేడబ్ల్యూ మోటార్ ఉండటంతో పాటు 72వీ 3.24 కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది.
ఈ బైక్ ను కొనుగోలు చేసిన వాళ్లు బైక్ పై గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ బైక్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉండటం గమనార్హం.