ప్రభుత్వ భూముల అమ్మకంపై విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి సీబీఐను కోరారు. ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కోకాపేట, ఖానామెట్ లో భూముల అమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 1500 కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఈ భూములను కేసీఆర్ తమకు కావాల్సిన వారికి కట్టబెట్టారని ఆరోపించారు. సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, జయేశ్ రంజన్ పైనా ఫిర్యాదు చేశామన్నారు.